అనన్య పాండేకు ఎన్‌సీబీ సమన్లు

అనన్య పాండేకు ఎన్‌సీబీ సమన్లు

ముంబై: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే ఇంట్లో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సోదాలు నిర్వహించింది. డ్రగ్స్ కేసులో ఆమెను ప్రశ్నించడానికి గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఎన్సీబీ కార్యాలయానికి రావాలని సమన్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, 22 ఏళ్ల అనన్య.. 2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో హిందీ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఖో గయే హమ్‌‌తోపాటు టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న లైగర్ సినిమా కూడా ఉంది. లైగర్‌తో తెలుగు సినీ అభిమానులను అలరించడానికి ఆమె సిద్ధమవుతోంది. 

మరిన్ని వార్తల కోసం: 

ఇది 130 కోట్ల భారతీయుల సమష్టి కృషి: మోడీ

జైలులో కొడుకును కలిసిన షారూఖ్

గిఫ్టులను పాక్ ప్రధాని అమ్ముకుంటున్నారా?