త్వరలో అదానీ ఎయిర్​పోర్ట్స్​ఐపీఓ​

త్వరలో అదానీ ఎయిర్​పోర్ట్స్​ఐపీఓ​

హైదరాబాద్​, వెలుగు : తమ ఎయిర్​పోర్ట్​  బిజినెస్‌​ను త్వరలో మార్కెట్లో లిస్ట్​చేసే ఆలోచన ఉందని అదానీ ఎంటర్‌‌ప్రైజెస్  వైస్– ప్రెసిడెంట్ జీత్ అదానీ అన్నారు. నగరంలో బుధవారం జరిగిన డ్రోన్​ లాంచింగ్​ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కంపెనీ పరిధిలోని అన్ని విమానాశ్రయాల సామర్థ్యాన్ని విస్తరిస్తున్నామని, గత ఏడాది ఇవి ఏకంగా 8 కోట్ల  మంది ప్రయాణికులకు సేవలను అందించాయని చెప్పారు. అదానీ ఎయిర్​పోర్ట్స్​ కొన్ని టార్గెట్లను చేరుకున్నాకే స్టాక్ ​మార్కెట్లకు వెళ్తుందని అన్నారు.

అదానీ ఎంటర్‌‌ప్రైజెస్ లిమిటెడ్  100 శాతం అనుబంధ సంస్థ అయిన అదానీ ఎయిర్‌‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్​ మంగళూరు, లక్నో, అహ్మదాబాద్, గౌహతి, జైపూర్, తిరువనంతపురం,  ముంబై ఎయిర్​పోర్టులను నిర్వహిస్తోంది. మనదేశ విమాన ప్రయాణీకుల్లో 25 శాతం మంది వీటి నుంచి ప్రయాణిస్తున్నారు.  భారతదేశం  ఎయిర్ కార్గో ట్రాఫిక్‌‌లో అదానీ ఎయిర్​పోర్ట్స్​కు 33 శాతం వాటా ఉంది.