అదానీ గ్రీన్ ఎనర్జీ జేవీలో రూ.2,500 కోట్లను ఇన్వెస్ట్​ చేసిన టోటల్

అదానీ గ్రీన్ ఎనర్జీ జేవీలో రూ.2,500 కోట్లను ఇన్వెస్ట్​ చేసిన టోటల్

న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ఎనర్జీ కంపెనీ టోటల్ ఎనర్జీస్ బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఏర్పాటు చేసిన రెన్యువబుల్​ ఎనర్జీ జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 300 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2,500 కోట్లు) పెట్టుబడి పెట్టింది. అదానీ గ్రూప్ సంస్థకు, ఈ  ఫ్రెంచ్ కంపెనీకి సమాన వాటాలు ఉంటాయి. దీనికి 1,050 మెగావాట్ల ప్రాజెక్ట్ పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోలియో ఉంటుంది. టోటల్ ఎనర్జీస్ అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ నైన్ లిమిటెడ్ (ఏఆర్​ఈ9ఎల్​)లో 50 శాతం వాటాను  300 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిందని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏఈజీఎల్​) స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలిపింది. ఏఈజీఎల్ కి ఏఆర్​ఈ9ఎల్ అనుబంధ సంస్థ. 1,050 మెగావాట్ల ప్రాజెక్ట్ పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోలియోలో 300 మెగావాట్ల  కార్యాచరణ సామర్థ్యం, 500 మెగావాట్ల నిర్మాణంలో ఉన్న సోలార్ ప్రాజెక్టులు,  250 మెగావాట్ల సామర్థ్యం గల అభివృద్ధి చెందుతున్న ప్రాజెక్టులు ఉన్నాయి. ఏఈజీఎల్​లో దాదాపు 19.75 శాతం వాటా ఉన్న టోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనర్జీస్ గతంలో ఏఈజీఎల్,  మరొక అనుబంధ సంస్థ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ ట్వంటీ త్రీ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టుబడి పెట్టింది. ఈ ఏడాది నవంబర్ 27 నాటి వాల్యుయేషన్ రిపోర్ట్ ప్రకారం,  ప్రాజెక్ట్ పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోలియో కంపెనీల మొత్తం వాల్యుయేషన్  489 మిలియన్ డాలర్లకు సమానం. టోటల్ ఎనర్జీస్ డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆమోదం కోరుతూ షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు పంపిన నోటీసులో ఏఈజీఎల్ ఈ విషయం​ తెలిపింది. "లావాదేవీలో భాగంగా, టోటల్ ఎనర్జీస్ ఏఆర్​ఈ9ఎల్​లో 50 శాతం వాటాను కొనుగోలు చేస్తుంది. వీటి విలువ 300 మిలియన్ డాలర్లు.  ఈ ప్రాజెక్ట్ పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోలియో పలు కంపెనీలను కలిగి ఉంటుంది " అని పేర్కొంది. నిర్మాణంలో ఉన్న,  అభివృద్ధిలో లేని ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి, నిధుల కేటాయింపునకు జేవీ దృష్టి పెడుతుంది.  ఫ్రెంచ్ సంస్థ ఏజీఈ23ఎల్​లో రూ. 4,013 కోట్ల మొత్తాన్ని ఇన్వెస్ట్​ చేసింది.