
ఆదిలాబాద్, వెలుగు: పిడుగుపాటుకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన షార్ట్ఫిల్మ్కు సంబంధించిన లోగోను ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఇటీవల పిడుగుపాటుకు జిల్లాలో పలువురు మృతిచెందిన నేపథ్యం కలెక్టర్ ఆదేశాల మేరకు డీపీఆర్వో ఆధ్వర్యంలో సాంస్కృతిక సారధి కళాకారులతో షార్ట్ఫిల్మ్ రూపొందించారు.
పిడుగులు పడే అవకాశం ఉన్న సమయాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని కలెక్టర్ సూచించారు. మబ్బులు కమ్ముకొని భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులు వస్తే పిడుగులు పడతాయని గుర్తించాలన్నారు. చెట్ల కిందకు పరుగెత్తకూడదని సూచించారు.