
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు ఆదిలాబాద్కలెక్టరేట్ ముందు ఆందోళను దిగారు. దివ్యాంగులు, వృద్ధులకు ఇచ్చిన హామీ ప్రకారం ఆసరా పింఛన్ డబ్బులు పెంచాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి(వీహెచ్పీ), ఎమ్మార్పీఎస్ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించి, పెండింగ్వేతనాలు చెల్లించాలని కోరుతూ 104 ఉద్యోగుల ఆందోళన చేశారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించేంతవరకు నిరసన తెలుపుతామని వెల్లడించారు. ఆయా కార్యక్రమాల్లో వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు ప్రేమ్రాజ్, సీపీఎం ఏరియా కమిటీ కార్యదర్శి లంక రాఘవులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, 104 ఉద్యోగ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.