
స్వాతంత్య్రం రాకముందు ఆదివాసీలు ఎలా ఉన్నారో.. ఇప్పుడు అలాగే ఉన్నారని అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. తమ భూముల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారని చెప్పారు. 2006 కేంద్ర చట్టం ప్రకారం పొడుభూములకు పట్టాలివ్వాలన్నారు. అదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబాను ఆయన దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులను ఉసి గోలిపి దౌర్జన్యం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం కల్పించుకొని ఆదివాసీలకు రక్షణ కల్పించాలన్నారు. జీవో నెం.3పై కేంద్రం దృష్టిసారించడంతోపాటు జోడేఘాట్ను పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని కోరారు. యూనివర్సిటీ లేని ఏకైక జిల్లా ఆదిలాబాద్ అని..ట్రైబల్ యూనివర్సిటీని కుట్రపూరితంగా తరలించుకపోయారని విమర్శించారు. జంగుబాయి, సదల్ పూర్ ఆలయాల అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్ పై ఆదివాసీలకు అపారమైన నమ్మకం ఉందన్న ఆయన.. బీజేపీ సర్కార్ ఏర్పడ్డాక అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.