ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో జనం పోగొట్టుకున్న రూ.39 లక్షల విలువ చేసే 200 సెల్ ఫోన్లను గురువారం ఎస్పీ అఖిల్ మహాజన్ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫోన్లు పోగొట్టుకుంటే బాధితులు వెంటనే https://www.ceir.gov.in వెబ్సైట్లో లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు.
పోగొట్టుకున్న ఫోన్ల కోసం రికవరీ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో అడ్మిన్ ఏఎస్పీ పి.మౌనిక, ట్రైనీ ఎస్పీ రాహుల్ కాంత్, అదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ప్రత్యేక బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
