నిర్మల్, వెలుగు: మహబూబ్నగర్, బాసర ట్రిపుల్ ఐటీల్లో 2026-–27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు ఆర్జీయూకేటీ బాసర వైస్ చాన్స్లర్ గోవర్ధన్ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 16న నోటిఫికేషన్ జారీ చేయనుండగా, 18 నుంచి మే 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు సంబంధించిన అప్ డేట్స్ తమ అధికారిక వెబ్సైట్ https://www.rgukt.ac.in/ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
