మా భూభాగంలో ఎవ్వరినీ అడుగు పెట్టనియ్యం: ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి

మా భూభాగంలో ఎవ్వరినీ అడుగు పెట్టనియ్యం: ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి

భారత్​ తో ఆఫ్ఘనిస్తాన్​ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్​భూభూగాన్ని ఏ దేశానికి అనుకూలంగా ఉపయోగించబోమని ప్రకటించింది. శుక్రవారం ( అక్టోబర్​ 10)  ఢిల్లీలోని హైదరాబాద్​ హౌజ్​ లో విదేశాంగ మంత్రి జైశంకర్​ తో భేటీ అయిన ఆఫ్ఘనిస్తాన్​ తాలిబన్​ విదేశాంగ మంత్రి అమీర్​ ఖాన్​ ముత్తాకి సమావేశం అయ్యారు.  కాబూల్​ తన భూభాగాన్ని  ఏ దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించడానికి అనుమతించదు అని ముత్తాకి హామి ఇచ్చారు. 

రెండు దేశాల మధ్య  సత్సంబంధాలను నెలకొల్పేందుకు చర్చలు జరిపారు.  వాణిజ్యం, అభివృద్ధి, భద్రతలో సహకారానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.
ఆఫ్ఘనిస్తాన్​ లో అభివృద్ధి ప్రాజెక్టులను కొనసాగిస్తామని భారత్  ప్రకటించడంతో తాలిబన్​ మంత్రి స్వాగతించారు.  ఇటీవల ఆఫ్ఘనిస్తాన్​ లో భూకంపాలు, వరదల సమయంలో భారత్​ అందించిన సాయం, మద్దతుకు తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్​ ఖాన్​ ముత్తాకి కృతజ్ణతలు తెలిపారు. 

2021లో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నిలిచిపోయిన ఆర్థిక సంబంధాలను పునరుద్దరించేందుకు ద్వైపాక్షిక వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు ఉమ్మడి వాణిజ్య కమిటీని  ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 

►ALSO READ | Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి.. ట్రంప్ కు నిరాశే

గత రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్‌లో రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు ,పార్లమెంట్ భవనంతో సహా వివిధ పునర్నిర్మాణ ప్రాజెక్టులలో భారత్​ 3 బిలియన్ల డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది.

సరిహద్దు విషయంలో పాకిస్తాన్​కు స్ట్రాంగ్​ వార్నింగ్ ఇచ్చారు ముత్తాకి. పాకిస్తాన్​ విధానం సమస్యలను పరిష్కరించలేదు. ఆఫ్ఘన్​ ప్రజల సహనం, ధైర్యాన్ని పాకిస్తాన్​సవాల్​ చేస్తుందన్నారు.