సికందర్‌ జోర్‌దార్‌..    రజా మెరుపు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సికందర్‌ జోర్‌దార్‌..    రజా మెరుపు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • సికందర్‌ జోర్‌దార్‌..
  • రజా మెరుపు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • లక్నోపై పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్కంఠ విజయం

లక్నో:  వరుసగా రెండు ఓటముల తర్వాత ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌16లో పంజాబ్ కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలుపు బాట పట్టింది.  భుజం నొప్పితో రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శిఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆటకు దూరమైనా లీగ్​లో మూడో విజయం సొంతం చేసుకుంది. సికందర్ రజా ( 41 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 57), షారుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (10 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 2 సిక్సర్లతో 23 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ధనాధన్​ బ్యాటింగ్​తో చెలరేగడంతో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్​లో పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​ 2 వికెట్ల  తేడాతో లక్నో సూపర్​ జెయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ఓడించింది.  

మొదట బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన లక్నో సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్ణీత 20 ఓవర్లలో 159/8 స్కోరు చేసింది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (56 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో74) ఫిఫ్టీతో మెప్పించాడు. కైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (29), క్రునాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండ్యా (18),  మార్కస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోయినిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (15) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. 13.1 ఓవర్లకే స్కోరు వంద దాటినప్పటికీ చివరి ఏడు ఓవర్లలో సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 58 పరుగులు మాత్రమే రాబట్టింది.

పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో  స్టాండిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడు, కగిసో రబాడ రెండు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సికందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తలో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీశారు.  అనంతరం రజా, షారుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెరుపులతో పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 19.3 ఓవర్లలో 161/8 స్కోరు చేసి గెలిచింది. యుధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తలో రెండు వికెట్లు తీశారు. రజాకు ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డు దక్కింది.

గెలిపించిన రజా, షారుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

సాధారణ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జమ్మూ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యుధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చారక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  తన వరుస ఓవర్లలో  ఓపెనర్లు అథర్వ తైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0), ప్రభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిమ్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (4)ను ఔట్ చేసి పంజాబ్​కు షాకిచ్చాడు. పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేలో మెరుపులు మెరిపించిన మాథ్యూ షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (34)ను ఇంపాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేర్చగా.. కాసేపు ప్రతిఘటించిన హర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాటియా (22) వెనుదిరగడంతో 11 ఓవర్లకు పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 75/4తో కష్టాల్లో పడింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సికందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రజా ఒక్కసారిగా రెచ్చిపోయాడు.

క్రునాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసిన 13వ ఓవర్లో 6, 6, 4తో టీమ్​ను రేసులోకి తెచ్చాడు. వరస బౌండ్రీలు కొడుతూ 34 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. సామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (6), కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టిన స్టన్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జితేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2) ఔటైనా రజాకు తోడైన షారుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  తన తొలి బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టాడు. పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయానికి 13 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 21 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరమైన టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రజాను బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో లక్నో మళ్లీ రేసులోకి వచ్చింది. కానీ, మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసిన 19వ ఓవర్లో షారుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (4) ఫోర్​ రాబట్టి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తమవైపు లాగేసుకున్నారు. లాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్లో షారుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2, 2, 4తో పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలిపించాడు.