
కోల్కతా: తేనెటీగల గుంపు కారణంగా కోల్కతా నుంచి అగర్తలా వెళ్లే ఎయిరిండియా ఫ్లైట్ రెండు గంటలకుపైగా ఆలస్యమైంది. ఈ ఘటన ఆదివారం కోల్కతా ఎయిర్ పోర్ట్ లో జరిగింది. ఉదయం 9.40 గంటలకు ఏఐ743 ఫ్లైట్ 136 మంది ప్రయాణికులతో బయలుదేరాల్సి ఉంది. ఫ్లైట్ ముందు భాగంలో గుంపుగా ఉన్న తేనెటీగలను పైలట్లు గుర్తించారు. ఇంజిన్ నుంచి ఫ్లైట్ లోపలికి తేనెటీగలు వచ్చే అవకాశం ఉండటం, వాటి వల్ల ఎయిర్ క్రాఫ్ట్ దెబ్బ తినే అవకాశం ఉండటంతో పైలట్లు ఫ్లైట్ ను నిలిపేశారు. అవి అక్కడి నుంచి మెయిన్ రన్ వే పైకి చేరడంతో 2 గంటల పాటు ఫ్లైట్ ను ఆపేశారు. ఫైర్ సిబ్బంది వచ్చి పరిస్థితిని అదుపులోకి తేవడంతో రెండు గంటల తర్వాత విమానం బయలుదేరింది.