ఎయిరిండియా కొత్త లోగో.. ఎరుపు, తెలుపు, ఊదా రంగులతో..

ఎయిరిండియా కొత్త లోగో.. ఎరుపు, తెలుపు, ఊదా రంగులతో..

ఎయిర్‌ ఇండియా కొత్త లోగోను తెరపైకి తీసుకొచ్చింది. రీబ్రాండింగ్ తర్వాత కొత్త లోగోను తీసుకొచ్చింది. ప్లేన్‌ కలర్‌ స్కీమ్‌ను సంస్థ ఆవిష్కరించింది. జనవరి 2022లో టాటా గ్రూప్ కొనుగోలు చేసిన తర్వాత ఎయిర్ ఇండియా తన కొత్త లోగోను పెద్ద రీ బ్రాండింగ్‌లో గురువారం (ఆగస్టు 10న) ఆవిష్కరించింది. 

టాటా గ్రూప్ టేకోవర్ తర్వాత ప్రధాన రీబ్రాండింగ్ దశలో ఎయిర్‌లైన్ మేజర్ ఎయిర్ ఇండియా తన కొత్త లోగోను గురువారం ఆవిష్కరించింది. కొత్త లోగోకు సంబంధించిన  డిజైన్‌ను ఆవిష్కరించారు. కొత్త లోగోలో ఎరుపు, తెలుపు మరియు ఊదా రంగులతో కూడిన కొత్త రంగు స్కీమ్‌తో ఎయిర్‌లైన్ యొక్క ఐకానిక్ మహారాజా మస్కట్‌ను పొందుపర్చారు. కొత్త లోగోను టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఆవిష్కరించారు. ఎయిర్‌ ఇండియా కొత్త లోగో అపరిమిత అవకాశాలను సూచిస్తుందదని అన్నారు.

జనవరి 2022లో ఎయిర్ ఇండియాను టాటా సన్స్ పూర్తిగా కొనుగోలు చేసిన తర్వాత రీబ్రాండింగ్‌ చేసింది. 1946లో ఎయిర్ ఇండియా ప్రారంభమైనప్పటి నుండి మహారాజా అనేది ఎయిర్ ఇండియా గుర్తింపులో అంతర్భాగంగా ఉన్న విషయం తెలిసిందే.