ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్పూర్,వారణాసి వంటి ఎనిమిది నగరాల్లో 5G ప్లస్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. దశలవారీగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. 5G ప్లస్ సేవలను పొందేందుకు సిమ్ కార్డు మార్చాల్సిన అవసరం లేదని, 5జీ ఫోన్ ఉంటే సరిపోతుందని ఎయిర్టెల్ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న వేగం కంటే 20 నుంచి 30 రెట్ల అధిక వేగంతో ఈ సేవలను పొందవచ్చునని తెలిపింది.
5జీ ఫోన్లన్నీ ఎయిర్టెల్ 5జీకి సపోర్ట్ చేయకపోవచ్చని, దీనికి సంబంధించి మొబైల్ సంస్థలు OTA అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుదని ఎయిర్టెల్ తెలిపింది. ప్రస్తుతం Apple, Samsung, Xiaomi, Vivo, Oppo, Realme , OnePlus 5G మొబైల్స్ లలో ఎయిర్టెల్ 5G ప్లస్ సేవలకు అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 5 నుంచి ఢిల్లీ, ముంబయి, కోల్కతా, వారణాసి నగరాల్లో ట్రయల్ బేసిస్పై 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు జియో ప్రకటించింది.