రజినీ లాల్ సలామ్ మూవీపై.. ఐశ్వర్య రజనీకాంత్‌ నోట్ రిలీజ్

రజినీ లాల్ సలామ్ మూవీపై.. ఐశ్వర్య రజనీకాంత్‌ నోట్ రిలీజ్

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)అతిథి పాత్రలో కనిపిస్తున్న లేటెస్ట్ మూవీ లాల్ సలామ్.  తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్(Aishwarya Rajinikanth) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు ఐశ్వర్య. ఈ మూవీ లాస్ట్ డే ఇరవై రెండు గంటల పాటు(22hours) నాన్ స్టాప్ గా షూటింగ్ చేసినట్లు తెలుపుతూ నోట్ రిలీజ్ చేశారు. 

ఈ సినిమా మొదటి, చివరి రోజుల్లో షూటింగ్‌ తమిళనాడులోని అరుణాచలంలో జరిగింది. చివరి రోజు ఇరవై రెండు గంటల పాటు నాన్ స్టాప్‌గా షూటింగ్‌ చేశాం. నాలుగు నెలల నుంచి మా టీమ్ అంతా ఎంతో కష్టపడింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. గతంలో కంటే ఎంతో తెలివిగా, ధైర్యంగా మారాను. షూటింగ్‌కు సహకరించిన ప్రతివారికి ధన్యవాదాలు..అంటూ ఐశ్వర్య రజనీకాంత్‌ నోట్ లో పేర్కొన్నారు.  షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్ స్టార్ట్ అయ్యినట్లు కూడా తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ ఫ్యాన్స్ కామెంట్స్ తెలుపుతున్నారు. ఇక  ఈ మూవీలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌ సంతోష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 ఈ మూవీ నుంచి రజినీ ఫస్ట్ లుక్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. రజినీ ముస్లిం గెటప్ లో కనిపిస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్(Lyca Productions) ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.  ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికే భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. నెల్సన్ దర్శకత్వంలో జైలర్ మూవీ రేపు (ఆగస్టు10న) రిలీజ్ కానుంది.