
హైదరాబాద్, వెలుగు: టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ టూరిజం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వీఎస్. బోస్, ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి కోరారు. హిమాయత్నగర్లోని టూరిజంలో ఆఫీస్ లో మంగళవారం టూరిజం ఎండీ వల్లూరి క్రాంతిని కలిసి వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. పదవి విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలన్నారు. దీనిపై ఎండీ సానుకూలంగా స్పందించారని.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఏఐటీయూసీ పేర్కొంది.