
గోదావరిఖని, వెలుగు : సింగరేణి ఆధ్వర్యంలో ఒడిశాలో నిర్వహిస్తున్న నైనీ కోల్బ్లాక్ లో పని చేసేందుకు కార్మికులు, ఉద్యోగులను బలవంతంగా పంపొద్దని ఏఐటీయూసీ (గుర్తింపు సంఘం) ప్రధాన కార్యదర్శి కె.రాజ్కుమార్కోరారు. గురువారం గోదావరిఖనిలోని భాస్కర్రావు భవన్లో జరిగిన మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణిలోని క్లర్క్లు, సెక్యూరిటీ గార్డులు, ఇతర వృత్తుల్లోని కార్మికులను నైనీ బ్లాక్లో పనిచేయాలని యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసి ఒత్తిడి తెస్తుందని తెలిపారు.
ఇక్కడి కార్మికులు, ఉద్యోగులను బలవంతంగా పంపిస్తే అక్కడ భాష తెలియక, కుటుంబాన్ని తీసుకెళ్తే ఇబ్బందులు వస్తాయన్నారు. దీనిపై సింగరేణి పునరాలోచించి కేవలం ఒడిశా నైనీబ్లాక్ కోసమే ప్రత్యేక నోటిఫికేషన్జారీ చేయాలని సూచించారు. అంతకుముందు జీడీకే ఓపెన్కాస్ట్ –5 ప్రాజెక్ట్పై అఖిలపక్ష కార్మిక సంఘాలు నిర్వహించిన గేట్ మీటింగ్లో రాజ్కుమార్ మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 9న సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని సక్సెస్ చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాల జేఏసీ నేతలు కె.సదానందం, మెండె శ్రీనివాస్, వడ్డెపల్లి శంకర్, కె.విశ్వనాథ్, మడ్డి ఎల్లాగౌడ్, కవ్వంపల్లి స్వామి, ఆరెల్లి పోశం, మదన మహేశ్తదితరులు పాల్గొన్నారు.