
హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ‘అలయ్ బలయ్’ ఈ ఏడాది కూడా సందడిగా సాగింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా ప్రముఖులు హాజరయ్యారు. సంస్కృతి, సంప్రదాయాలపరంగా మనమంతా ఒక్కటేనని చాటి చెప్పారు.