
18 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్ 2025 విజేతగా ఆర్సీబీ అవతరించింది. 17 ఏళ్లు అందని ద్రాక్షగా మిగిలి పోయిన ఐపీఎల్ టైటిల్ను ఎట్టకేలకు 18వ సీజన్లో ఒడిసిపట్టుకుంది. 2025, జూన్ 3న గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచులో పంజాబ్ను చిత్తు చేసి తొలి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడింది ఆర్సీబీ. 18 ఏళ్లకు తమ అభిమాన ఆటగాడు విరాట్ కోహ్లీ జట్టు తొలిసారి టైటిల్ గెలవడంతో కోహ్లీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.
ఆర్సీబీ విజయాన్ని దేశవ్యాప్తంగా విరాట్ అభిమానులు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆర్సీబీ అభిమానుల సెలబ్రేషన్స్ టీమిండియా ఐసీసీ వరల్డ్ కప్ గెలిస్తే చేసే వేడుకలకు ఏ మాత్రం తక్కువ కాదనడం అతిశయోక్తి కాదు. మరోవైపు ఫస్ట్ టైమ్ ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకున్న ఆర్సీబీకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆర్సీబీకి అభినందనలు తెలుపుతున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, కార్తీక్ ఆర్యన్, రష్మిక మందన్నా, సచిన్ టెండూల్కర్, విక్కీ కౌశల్, అజయ్ దేవగన్తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్సీబీ విజయం తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ షేర్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంది. అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో అయాన్ ఎమోషనల్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
సంతోషంతో టీవీ ముందే బాటిల్లో ఉన్న నీళ్ళని తలపై పోసుకోవడంతో పాటు ఇంట్లో నేలపై పడుకుని ఎంజాయ్ చేశాడు. తనకు కోహ్లీ అంటే ఎంతో ఇష్టమని.. కోహ్లీ వల్లే క్రికెట్పై అభిమానం ఏర్పడిందని చెప్పాడు. మొత్తానికి ఈ సారి కూడా కప్ లాలీ పప్ అని చెప్పలేనని ఫన్నీ కామెంట్ చేశాడు. అల్లు అయాన్ సెలబ్రేషన్స్ వీడియోను ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ అల్లు అర్జు్న్ ఇన్స్ స్టా గ్రామ్లో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికంటే ముందు.. ‘‘వెయిటింగ్ ఈస్ ఓవర్.- ఈ సాలా కప్ నమ్దూ.18 సంవత్సరాలుగా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. ఆర్సీబీకి పెద్ద, పెద్ద అభినందనలు’’ అని అల్లు అర్జున్ పటిదార్ సేనకు విషెస్ తెలియజేశాడు.