బిజినెస్ డెస్క్, వెలుగు: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ శుక్రవారం నుంచి స్టార్ట్ కానుంది. ఈ నెల 8 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ప్రైమ్ సబ్స్క్రయిబర్లు గురువారం నుంచే పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్లు క్రెడిట్ కార్డ్పై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ను పొందొచ్చు. స్మార్ట్ఫోన్లను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా రూ.50 వేల వరకు రేట్లను తగ్గించుకోవచ్చని అమెజాన్ ప్రకటించింది. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అమెజాన్ ఇస్తోంది.
శామ్సంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ ఫోన్ రూ.26,990 కి గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్లో అందుబాటులో ఉంది. 2021 మార్చిలో ఈ ఫోన్ రూ.55,999 కి లాంచ్ అయ్యింది. రెడ్మీ కే50ఐ 5జీ స్మార్ట్ఫోన్ రూ.25,999 దగ్గర లాంచ్ కాగా, ఈ సేల్లో రూ.20,999 కి అందుబాటులో ఉంది. రియల్మీ జీటీ నియో3 స్మార్ట్ఫోన్ ధర రూ. 36,999 నుంచి రూ.25,975 కి తగ్గింది. షావోమి 11 లైట్ ఎన్ఈ 5జీ రేటు రూ. 26,999 నుంచి రూ.23,999 కి తగ్గగా, వివో వై100 5జీ రూ.23,999 కి ఫ్రీడమ్ సేల్లో దొరుకుతోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డును, పాత ఫోన్ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా రేట్లను ఇంకా తగ్గించుకోవచ్చు.
అన్నింటిపై ఆఫర్లు..
షావోమి స్మార్ట్టీవీ, శామ్సంగ్ టీవీ, టీసీఎల్, ఎల్జీ టీవీ, హైసెన్స్, ప్యాంపర్స్, ఏరియల్, విస్పర్, లోరియల్ పారిస్, లాక్మే, ట్రెసెమ్మి, డోవ్, పాండ్స్ వంటి బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లను ఆమెజాన్ ఇస్తోంది. స్మార్ట్ టీవీలపై 60 శాతం వరకు ఆఫర్ ఉంది. బెస్ట్ సెల్లింగ్ ల్యాప్టాప్లపై రూ.40 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నామని అమెజాన్ ప్రకటించింది. పాత ల్యాప్టాప్లను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా రూ.25 వేల వరకు ధర తగ్గించుకోవచ్చని వెల్లడించింది. అప్లియెన్స్లపై 60 శాతం వరకు, రిఫ్రిజిరేటర్లపై 55 శాతం వరకు, ఏసీలపై 55 శాతం వరకు ఆఫర్ను అమెజాన్ ప్రకటించింది. వాషింగ్ మెషిన్లు రూ.5,990 నుంచే అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్లపై 50–80 శాతం వరకు డిస్కౌంట్ను ప్రకటించింది. అమెజాన్ సొంత బ్రాండ్లు ఎకో,ఫైర్ టీవీ, కిండెల్ డివైజ్లపై 55 శాతం వరకు డిస్కౌంట్ను ప్రకటించింది.