
న్యూఢిల్లీ: మన దేశంలో ప్రభుత్వ అధికారులకు లంచాలిచ్చిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెజాన్ ఏకంగా రూ. 8,546 కోట్లను లీగల్ ఖర్చుల కోసం వెచ్చించింది. 2018–20 మధ్య కాలంలో ఈ మొత్తాన్ని ఖర్చు పెట్టినట్లు లీగల్ ఫైలింగ్స్ ద్వారా తెలుస్తోంది. లంచాల ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇంటర్నల్గా దర్యాప్తు జరుగుతోందని ఇప్పటికే అమెజాన్ వెల్లడించింది. ఫ్యూచర్ గ్రూప్ టేకోవర్విషయంలో అమెజాన్ లీగల్గా పోరాడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కూడా అమెజాన్పై దర్యాప్తు జరుపుతోంది. లీగల్ ఫీజులపై అమెజాన్ మాట్లాడానికి ఇష్టపడలేదు. అయితే, అమెజాన్ తన రెవెన్యూలో ఏకంగా 20 శాతాన్ని లాయర్లపై ఖర్చు పెట్టిందని దేశంలోని ట్రేడర్స్ బాడీ సెయిట్ ఆరోపిస్తోంది. ఈ లీగల్ ఖర్చులను చూస్తే, ప్రభుత్వాధికారులను మానిప్యులేట్ చేయడానికే వాడి ఉంటారని అర్ధం అవుతోందని సెయిట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయెల్కు లెటర్ రాశారు. తన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపని ఆయన, సీబీఐ ఎంక్వయిరీని డిమాండ్ చేశారు.