గుహవాటి: భారత దేశ అపర కుబేరుడు.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అసోంలోని కామాఖ్యదేవి అమ్మవారి ఆలయానికి 20 కిలోల బంగారం కానుకగా ఇచ్చారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన కామాఖ్య దేవి ఆలయానికి మొక్కుబడిలో భాగంగా అంబానీ దంపతులు భారీ ఎత్తున బంగారం విరాళంగా అందించారు. మూడు నెలల క్రితం అంబానీ దంపతులు దర్శించుకున్న సందర్భంగా గోపుర కలశాల తయారీ కోసం 20 కిలోల బంగారం అవసరం అవుతుందని ఆలయ అధికారులు అంబానీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు. గోపుర కలశాలకు బంగారం తాపడానికి అయ్యే ఖర్చును తాము భరించేందుకు సిద్ధమని తెలియజేశారు. అంబానీ దంపతులు ముంబైకి తిరిగి వెళ్లిన అనంతరం కామాఖ్య ఆలయ వర్గాలకు అధికారికంగా సమాచారం ఇవ్వగా సన్నాహాలు సిద్ధం చేశారు. హామీ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తరఫున 20 కిలోల బంగారాన్ని అందించగా ఆలయానికి అందించగా దేవస్థానం అధికారులు కలశాల నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఈ కలశాల నిర్మాణ కార్యక్రమంలో శిల్పులతో పాటు రిలయన్స్ ఇంజినీర్లు కూడా పాలుపంచుకుంటున్నారు. ఈ కలశాలు పూర్తయిన తర్వాత ముఖేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ మరోసారి కామాఖ్య అమ్మవారిని దర్శించుకోనున్నారు. ప్రముఖ శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య ఆలయం అసోంలోని నీలాచల కొండల్లో కొలువై ఉంది. ఇక్కడికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.
అమ్మవారికి అంబానీ కానుక 20 కిలోల బంగారం
- దేశం
- November 8, 2020
లేటెస్ట్
- ఇండియాకు 43 మెడల్స్ ఖాయం
- రేవంత్ సర్కార్ కూలిపోవాలని పూజలు చేయండి: అర్వింద్
- నేడు దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష
- ఐపీఎల్ మ్యాచ్లకు మయాంక్ యాదవ్ దూరం
- ఒక బాటిల్ విస్కీ ధర రూ.5 లక్షలు!
- కాంగ్రెస్ అన్ని వర్గాలను సమానంగా చూస్తుంది
- గుజరాత్కు ఆర్సీబీ షాక్.. 4 వికెట్ల తేడాతో నెగ్గిన రాయల్ చాలెంజర్స్
- బీజేపీకి ఓటేస్తే బానిస బతుకులే..
- ఇవ్వాల తెలంగాణకి అమిత్ షా
- వెలుగు సక్సెస్: విపత్తు నిర్వహణ సంస్థలు
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..