జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయ్యింది: ఏపీ మంత్రి అంబటి

జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయ్యింది: ఏపీ మంత్రి అంబటి

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు తరువాత ఆంధ్రప్రదేశ్ లోనూ టీడీపీ జెండా పీకేస్తారని అంబటి రాంబాబు అన్నారు.  ఇప్పటికే తెలంగాణలో టీడీపీ జెండా పీకేసారని ఆయన అన్నారు.   తెలంగాణలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీకి రాజీనామా చేయటాన్ని ప్రస్తావించారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని..జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయింది కాబట్టి రాజీనామా చేశారు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడానికి అన్నీ ఏర్పాట్లు చేసుకున్న తరువాత చంద్రబాబు పోటీచేయవద్దన్నారని... లోకేష్ కు 14 సార్లు ఫోన్ చేస్తే స్పందించలేదని  జ్ఞానేశ్వర్ చెప్పారు.  తాను క్యాడర్ కు సమాధానం చెప్పలేకనే పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని  జ్ఞానేశ్వర్ చెప్పారు,

ఇతర పార్టీల గెలుపుకోసం పార్టీని తాకట్టు పెట్టడం అనైతికం అంటూ విమర్శించారు.వచ్చే ఎన్నికల్లో ముందో తర్వాతో ఏపీలోనూ జెండా పీకేస్తారని అన్నారు.ఇక ఏపీలోనూ టీడీపీ ఉండదని జోస్యం చెప్పారు. 1983లో ఎక్కడైతే ఎన్టీఆర్ జెండా ఎగుర వేశాడో.. అక్కడ టీడీపీ జెండా పీకేసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారు, ఆంధ్రలో త్వరలో పీకేస్తారు.. ఇది నిజం అంటూ జోస్యం చెప్పారు. ఎన్టీఆర్‌ను చంపిన చేతులతోనే టీడీపీని కూడా చంపేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపైనా మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా స్పందించారు.‘జ్ఞానేశ్వర్‌కు జ్ఞానోదయం అయింది... పవన్ ఎప్పుడు పరిపక్వమవుతాడో? అంటూ ఘాటుగా స్పందించారు. అంతేకాదు తెలంగాణలో చేతులెత్తేసిన తెలుగుదేశం... త్వరలో ఏపీలో కూడా అంటూ ఎద్దేవా చేస్తూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 

Also Read :- నిజం గెలిచిందన్న టీడీపీ.. వైసీపీ మంత్రి అంబటి సెటైర్లు