ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంలోకి అమెరికా.. ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై భారీ బాంబులతో దాడులు

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంలోకి అమెరికా..  ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై భారీ బాంబులతో దాడులు

ఒకవైపు శాంతి మంత్రం జపిస్తూ.. నోబెల్ శాంతి బహుమతి ఆశిస్తూ వార్తల్లో నిలిచిన ట్రంప్.. అనూహ్యంగా ఇరాన్ పై దాడులు చేశామని ప్రకటించడం ప్రపంచాన్ని షాకింగ్ కు గిరిచేసింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంటరయ్యింది. యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నామని.. యుద్ధంలోకి దిగాలా వద్దా అనేది వారం రెండు వారాల్లో నిర్ణయిస్తామని చెప్పిన అమెరికా.. ఉన్నట్లుండి ఇరాన్ కు షాకిచ్చింది.  రాత్రికి రాత్రే భారీ బాంబులతో దాడులకు దిగింది.

ఇరాన్ లోని ఫార్దో, నతాంజ్‌, ఇన్ఫహాన్‌ అణు స్థావరాలపై దాడి చేసింది అమెరికా. బీ-2 స్పిరిట్‌ అనే భారీ బాంబర్లతో భీకర దాడులు జరిపింది. దాడుల అనంతరం ఇరాన్ లోని మూడు అను స్థావరాలపై బాంబులు వేసినట్లు ఆదివారం (జూన్ 22) ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ కు వ్యతిరేకంగా యుద్ధంలోకి దిగామని అధికారికంగా అనౌన్స్ చేశారు. 

యుద్ధంలోకి  వెళ్లాలో వద్దో ఆలోచిస్తున్నామని, వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని శుక్రవారం (జూన్ 20) ప్రకటించిన అమెరికా.. సడెన్ గా దాడులకు దిగటం గమనార్హం. ఇరాన్ కు చెందిన కీలక స్థావరాలను పేల్చేశాం.. ఇది మిలిటరీ సక్సెస్ అంటూ ట్రంప్ అభివర్ణించారు. శాంతి కావాలో, దు:ఖం కావాలో ఇరాన్ తేల్చుకోవాలి.. శాంతి అవసరం లేదంటే మరిన్ని దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా ట్రంప్ హెచ్చరించారు.


ఇరాన్ పై దాడికి యూఎస్ అమ్ముల పొదిలో ఉన్న శక్తివంతమైన బాంబులను వాడింది. GBU-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్  (MOP) బాంబులతో ఫోర్డో అణు స్థావరంపై దాడి చేసింది. భూ గర్భంలో ఉన్న స్థావరాలను ధ్వంసం చేసేందుకు తయారు చేసిన B-2 స్పిరిట్ స్టీల్త్ బాంబులు వాడటంతో ఇరాన్ లో భారీ విధ్వంసం జరిగింది. ఈ దాడితో ఇరాన్ అణు స్థావరాలు ధ్వంసమైనట్లు అమెరికా ప్రకటించింది.