రివేంజ్ కాదు.. ఉగ్రవాదంపై దృష్టిపెట్టు : పాక్ కు అమెరికా హితవు

రివేంజ్ కాదు.. ఉగ్రవాదంపై దృష్టిపెట్టు : పాక్ కు అమెరికా హితవు

కశ్మీర్ పై భారత చర్యకు అమెరికా మద్దతు

పాకిస్థాన్  ప్రతీకార  చర్య  గురించి  ఆలోచించకుండా  ఆ దేశంలోని  ఉగ్రవాదంపై  చర్యలు  తీసుకోవాలని  కోరింది  అమెరికా విదేశాంగ శాఖ.  ఆర్టికల్ 370 రద్దుకు  నిరసనగా  భారత్ తో  దౌత్య  సంబంధాలను  నిలిపివేస్తూ  పాక్  ప్రకటన  చేసిన  కొద్ది  సేపటికే  అమెరికా  ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదే సమయంలో  ప్రపంచంలోనే  అతిపెద్ద  ప్రజాస్వామ్య  దేశంగా  ఉన్న  భారత్ లో  పౌరులందరికీ  సమాన  హక్కులు  కల్పించే  అధికారం  ఉందని  తెలిపింది. పారదర్శకత,  రాజకీయ  భాగస్వామ్యం  ప్రజాస్తంభానికి  మూలాలన్న  అమెరికా… భారత్  వీటిని  తప్పకుండా  పాటిస్తుందని  ఆశాభావం  వ్యక్తం  చేసింది.

జమ్ము  కశ్మీర్  ప్రత్యేక  హోదాను  రద్దు  చేసే అంశంపై  భారత ప్రభుత్వం  తమను  సంప్రదించలేదని  అమెరికా  ఓ ప్రకటనలో  తెలిపింది.  గతవారం బ్యాంకాక్ లో  సమావేశమైనప్పుడు  జమ్ము  కశ్మీర్ పై నిర్ణయం గురించి విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోకు చెప్పినట్టుగా మీడియాలో కథనాలు  వచ్చాయి. దీనిపై  స్పందించిన సౌత్ అండ్ సెంట్రల్ ఏసియా వ్యవహారాల శాఖ  యాక్టింగ్ అసిస్టెంట్ సెక్రటరీ అలైస్ వెల్స్..370 రద్దుపై  భారత్  తమను  సంప్రదించలేదని స్పష్టం చేశారు…..