ఇండియాలో మరిన్ని పెట్టుబడులకు రెడీ అవుతోన్న అమెరికా కంపెనీ యాపిల్​

ఇండియాలో మరిన్ని పెట్టుబడులకు  రెడీ అవుతోన్న అమెరికా కంపెనీ యాపిల్​

న్యూఢిల్లీ:  ఇండియాలో మరిన్ని పెట్టుబడులకు అమెరికా కంపెనీ  యాపిల్​ రెడీ అవుతోంది. చైనా–అమెరికా మధ్య సంబంధాలు రోజు రోజుకూ అధ్వానంగా మారుతుండటం, ఆసియాలోని మిగతా  దేశాలకూ బిజినెస్​ను విస్తరించాలనే ప్లాన్​ఇందుకు కారణాలు. భారతదేశంలో యాపిల్​ బిజినెస్​ను పెంచుతుండటం వల్ల ఈ కంపెనీ  నుంచి 2024  ఆర్థిక సంవత్సరంలో 1.20 లక్షల మందికి  ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని స్టాఫింగ్​ఫర్మ్​ టీమ్‌‌‌‌‌‌‌‌లీజ్ సర్వీసెస్  తెలిపింది. వీరిలో  40 వేల మందికి డైరెక్ట్​గా, 80 వేల మందికి ఇన్​డైరెక్ట్​గా ఉపాధి దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇండియాలో తన మార్కెట్​ను విస్తరించుకోవడానికి యాపిల్​ ఇక్కడ తయారీని పెంచబోతోంది. దీనివల్ల 2026  ఆర్థిక సంవత్సరం నాటికి,  కనీసం మూడు లక్షల మందికి జాబ్స్​ వస్తాయని అంచనా. వీరిలో లక్ష మందికి డైరెక్ట్​గా, మిగతా వారికి ఇన్​డైరెక్ట్​గా ఉపాధి దొరుకుతుందని అంటున్నారు. టీమ్​లీజ్ ​చీఫ్ ఎగ్జిక్యూటివ్ కార్తీక్ నారాయణ్   మాట్లాడుతూ అదనపు ప్లాంట్లను,  ఫ్యాక్టరీలను ఓపెన్​ చేయడం వల్ల రాబోయే 36   నెలల్లో చాలా మందికి అవకాశాలు దొరుకుతాయని చెప్పారు. కర్ణాటకలోని 300 ఎకరాల కొత్త ఫ్యాక్టరీలో యాపిల్ ఫోన్స్​ తయారవుతాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్,  ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు. ఇండియా, మిడిల్ ​ఈస్ట్​, మెడిటేరియన్​, తూర్పు యూరప్  ఆఫ్రికాలకు బాధ్యత వహిస్తున్న  వైస్  ప్రెసిడెంట్- హ్యూగ్స్ అస్సేమాన్- ఇటీవల వైదొలగిన తర్వాత కంపెనీ విధానాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఆయన  స్థానంలో ఆశిష్ చౌదరిని ప్రమోట్ చేస్తున్నారు.  ఇండియా హెడ్​గానూ పనిచేసే చౌదరి, ఇక నుంచి యాపిల్ ప్రొడక్ట్​ సేల్స్​ హెడ్​ మైఖేల్ ఫెంగర్‌‌‌‌కు నేరుగా రిపోర్ట్ చేస్తారు. 

అమ్మకాలు డౌన్​...

కంపెనీ పోయిన క్వార్టర్​లో భారత దేశంలో రికార్డు ఆదాయాన్ని నమోదు చేసినా, మొత్తం అమ్మకాలు మాత్రం 5 శాతం పడిపోయాయి. యాపిల్​ ఫోన్ల ధరలు ఎక్కువగా ఉండటమే కారణమని రిటైలర్లు చెబుతున్నారు.  ఇండియాలో మరింత బలపడేందుకు యాపిల్ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ స్టోర్‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చింది.  ఈ ఏడాది చివరిలో దేశంలో తన మొదటి రిటైల్ అవుట్‌‌‌‌లెట్‌‌‌‌ను తెరవాలని భావిస్తోంది. యాపిల్​ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తమ కంపెనీ ఇండియా మార్కెట్‌‌‌‌కు చాలా ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. చైనా లాగానే ఇండియాలోనూ వేగంగా ఎదుగుతున్నామని స్పష్టం చేశారు. యాపిల్​కు చైనా నుంచి ఏటా దాదాపు 75 బిలియన్​ డాలర్లు వస్తున్నాయి. అమెరికా, యూరప్​ తర్వాత అత్యధిక అమ్మకాలు చైనా నుంచే ఉన్నాయి. తమకు సేల్స్​పరంగా, ప్రొడక్ట్​ డెవెలప్​మెంట్ ​ పరంగానూ ఇండియా చాలా ముఖ్యమని యాపిల్ ​వర్గాలు తెలిపాయి. అందుకే యాపిల్​ ప్రొడక్టులను తయారు చేసే కంపెనీలు ఇండియాలోనూ ప్లాంట్లను పెడుతున్నాయి. ఇదే  విషయమై తన కాంట్రాక్ట్​ పార్ట్​నర్​ ఫాక్స్​కాన్​తో  చర్చిస్తోంది. దక్షిణాదిన ప్లాంటు పెట్టేందుకు యాపిల్​, దీని కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్​ ఫాక్స్​కాన్​లు కొన్ని ప్రభుత్వాలతో లాబీయింగ్ చేశాయి.