
నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ తర్వాత కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పరీక్షలు సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఏడుగురు సభ్యులతో హైలెవల్ నిపుణుల కమిటీ వేసింది. ఏడుగురు సభ్యుల ఈ కమిటీకి ఇస్రో మాజీ ఛైర్మన్ కె. రాధాకృష్ణన్ ఛైర్మన్ గా ఉండనున్నారు. కేంద్ర విద్యాశాఖ. సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ఎన్టీయే పనితీరు మెరుగుపరిచేందుకు సూచనలు ఇవ్వనుంది ఈ కమిటీ. కమిటీ తన నివేదికను 2 నెలల్లో కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది.
ప్యానెల్లోని నిపుణులు ఎవరంటే?
ఈ కమిటీలో ఎయిమ్స్ ఢిల్లీ మాజీ డైరెక్టర్ డా. రణ్దీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్. బి.జె. రావు, ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కె. రామమూర్తి , కర్మయోగి భారత్ సహ వ్యవస్థాపకుడు పంకజ్ బన్సల్, ఐఐటీ దిల్లీ డీన్ (విద్యార్థి వ్యవహారాలు) ప్రొఫెసర్ ఆదిత్య మిత్తల్, కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైశ్వాల్ సభ్యులుగా ఉన్నారు.
Former ISRO Chairman and Chairman BoG, IIT Kanpur, Dr K Radhakrishnan will head the High-Level Committee of Experts to ensure transparent, smooth and fair conduct of examinations. pic.twitter.com/z2DgHGBvZd
— ANI (@ANI) June 22, 2024