దీన్ దయాల్ జయంతి: నివాళులు అర్పించిన అమిత్ షా

దీన్ దయాల్ జయంతి: నివాళులు అర్పించిన అమిత్ షా

ఢిల్లీ: బీజేపీ వ్యవస్థాపకుడు పండిట్ దీన్ దయాల్ జయంతి సందర్భంగా ఆయన విగ్రమానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు  బీజేపీ చీఫ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా.  దీన్ దయాల్ ఆలోచనలు, సూత్రాలు దేశాన్ని పునర్నిర్మించడంలో ఎంతగానో ఉపయోగనడ్డాయని ఆయన అన్నారు.

పండిట్ దీన్ దయాల్ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ రసూల్ పూరాలో నిర్వహించిన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్  హాజరయ్యారై నివాళులు అర్పించారు. మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్రంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ ను నిషేధించాలని కోరారు.