
అమ్రాబాద్, వెలుగు: గత మూడు నెలలుగా నిలిచిపోయిన అమ్రాబాద్ టైగర్ సఫారీ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. దీంతో పర్యాటకులు తరలివస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఫర్హాబాద్ వద్ద నిజాం షికార్ ఘర్ సమీప అడవిలో సఫారీకి వెళ్లిన పర్యాటకులకు పెద్దపులి కనిపించింది. దీంతో పర్యాటకులు ఫొటోలు, వీడియోలు తీసుకొని ఆనందపడ్డారు.