ఈ ఏడాది నాకు నచ్చిన ఫోటో

ఈ ఏడాది నాకు నచ్చిన ఫోటో

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర తనకు నచ్చిన  అంశంపై తనదైన శైలిలో ట్విట్టర్లో  కామెంట్ చేస్తారు.   వీడియోలు పోస్ట్ చేస్తారు.  కొన్ని  పోస్టులు కామెడీగా ఉంటే.. మరికొన్ని  ఆలోచించే విధంగా ఉంటాయి. అలాంటి ఫోటోనే 2021  డిసెంబర్ 31న పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్ర. ఈ  సంవత్సరంలో  తనకు  నచ్చిన ఫోటో ఇదేనంటూ ఓ కొటేషన్ రాశారు.  ఇందులో ఏముందంటే.. ఓ తండ్రి తోపుడు బండి తోపుకుంటూ వస్తున్నాడు. బండిపైన ఓ బాలుడు పుస్తకంలో ఏదో రాస్తూ కనిపిస్తున్నాడు.   ‘ ఈ సంవత్సరంలో నాకు ఇష్టమైన ఫోటో  ఇది.  ఈ ఫోటో ఎవరు తీశారో నాకు తెలియదు.  ఇది నా ఇన్‌బాక్స్‌లో కనిపించింది. ఆశ, కృషి, ఆశావాదానికి ఈ ఫోటో నిదర్శనం. మనం ఎందుకు జీవిస్తున్నామో ఈ  చిత్రం తెలియజేస్తుంది. మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని పోస్టు పెట్టారు. ఈ పోస్టును ఇప్పటి వరకు దాదాపు 84 వేల మంది లైక్ చేశారు.