
జోగిపేట, పుల్కల్, వెలుగు : అందోల్ నియోజకవర్గంలో గురువారం మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించనున్నారు. రూ. 31.24 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. సుల్తాన్పూర్లో కేజీబీవీ పాఠశాల భవన నిర్మాణానికి, అందోల్లో అందోల్ జోగిపేట్ మున్సిపాలిటీకి వెల్కమ్ ఆర్చ్ కమాన్లకు శంకుస్థాపనలు చేయనున్నారు. పాలిటెక్నీక్ కళాశాల వద్ద బస్ షెల్టర్లను ప్రారంభించనున్నారు.
రూ. 2.20 కోట్లతో కేజీబీవీ పాఠశాల భవనంలో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించనున్నారు. సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనంలో నిర్మించిన పేరెంట్స్ వెయిటింగ్ హాల్, టాయిలెట్స్ ప్రారంభిస్తారు. రూ. 5.75 కోట్లతో ఆర్డీవో కార్యాలయం, నివాస గృహాల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఐసీడీఎస్ కార్యాలయ భవనం నిర్మాణానికి శంకుస్థాపన, రూ. 2 కోట్లతో స్వామి వివేకానంద పార్క్ లో సుందరీకరణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
జోగిపేటలో రూ. 7.23 కోట్లతో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ లో కాంపౌండ్ వాల్, షాపింగ్ కాంప్లెక్స్, రైతు వెయిటింగ్ హాల్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అందోల్ మండలం నేరడిగుంటలో రూ. 2.45 కోట్లతో పీహెచ్సీ భవన నిర్మాణానికి జోగిపేట మార్కెట్ యార్డ్ లో శంకుస్థాపన చేస్తారు. రూ. 5 లక్షలతో జోగిపేటలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌజ్ను మంత్రి ప్రారంభిస్తారు.