
అమృత్సర్: ప్రతిష్టాత్మక వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్కు ఇండియా ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది. 2029 ఎడిషన్ ఆతిథ్య హక్కుల కోసం అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) బిడ్ వేయనుందని ఏఎఫ్ఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అంజు బాబీ జార్జ్ తెలిపింది.
కాగా, 2036 ఒలింపిక్స్ వరకు వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేయాలని ఏఎఫ్ఐ నిర్ణయించింది. 2036 ఒలింపిక్స్లో అథ్లెటిక్స్ నుంచి కనీసం 5–6 మెడల్స్ సాధించేలా ఇండియా అథ్లెట్లను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.