- కోళ్లు, చేపలు, మేకలు, గొర్లు, రొయ్యల్లో పెరిగిపోతున్న మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్
- ఐకార్-ఎఫ్ఏవో స్టడీలో ఆందోళనకర విషయాలు
- యాంటీ బయాటిక్ను బట్టి 40 నుంచి 90% వరకు నిరోధకత
- అత్యధికంగా పెన్సిలిన్స్కు 70–90 శాతం రెసిస్టెన్స్
- జంతువుల్లో యాంటీ బయాటిక్స్వాడకంపై నిఘా పెట్టాలని రిపోర్టులో సూచన
హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు సండే వస్తేనో లేదంటే పండుగో పబ్బమో ఉంటేనో ఇంట్లో నీసు కౌసు ఉండేది. కానీ ఇప్పుడు నాన్వెజ్ రెగ్యులర్ ఫుడ్ ఐటెం అయిపోయింది. అయితే ఆ నాన్వెజ్లో యాంటీ బయాటిక్స్ స్థాయిలు ఎక్కువైపోతుండడం ఆందోళన కలిగిస్తున్నది. కోళ్లు, మేకలు, గొర్లు, చేపలు, రొయ్యలన్నా తేడా లేకుండా అన్నింటి పెంపకంలోనూ యాంటీ బయాటిక్స్ వాడకం పెరిగిపోతున్నది. దీంతో వాటిల్లో మల్టీ డ్రగ్రెసిస్టెన్స్ (నిరోధకత) ఎక్కువైపోతున్నది. ఏదైనా జబ్బు చేస్తే ప్రజలు వాడే యాంటీ బయాటిక్లకు ఆ జీవాలూ రెసిస్టెన్స్ను పెంచుకుంటున్నాయి. ఇండియన్ కౌన్సిల్ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐకార్), ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) కలిసి చేసిన స్టడీలో ఈ ఆందోళనకరమైన విషయాలు వెల్లడయ్యాయి.
దేశంలో తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల నుంచి 2019–2022 మధ్య కాలంలో శాంపిళ్లను సేకరించిన సంస్థలు.. ఈ–కొలి, స్టఫైలోకోకస్, ఏరోమోనస్, విబ్రియో వంటి వివిధ రకాల బ్యాక్టీరియా ఆనవాళ్లపై పరిశోధనలు జరిపాయి. కోళ్లు, ఆవులు, బర్లు, గొర్లు, మేకలు, చేపలు, రొయ్యలు, పందుల నుంచి శాంపిళ్లను సేకరించి యాంటీ బయాటిక్స్ రెసిస్టెన్స్ను టెస్ట్చేశాయి. వీటిలో బర్లు, ఆవులు తప్ప మిగతావన్నీ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ను సంతరించుకుంటున్నాయని.. వాటిల్లో యాంటీ బయాటిక్స్అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయని స్టడీ తేల్చింది. ముఖ్యంగా మనం వాడే పెన్సిలిన్స్కు అధికంగా 70 నుంచి 90 శాతం వరకు ఇప్పటికే వాటికి రెసిస్టెన్స్వచ్చిందని.. ఎరిత్రోమైసిన్, సెఫొటాక్సిమ్, మెరోపినమ్, సిప్రొఫ్లోక్సాసిన్, సెఫొక్సిటిన్, సెఫ్పొడాక్సిమ్, అమికాసిన్వంటి వాటికి ఎక్కువ మొత్తంలో నిరోధకతను సంతరించుకుంటున్నాయని తెలిపింది.
కోళ్లలోనే ఎక్కువ..
ఎక్కువగా కోళ్లలోనే యాంటీ బయాటిక్స్రెసిస్టెన్స్పెరుగుతున్నట్టు స్టడీ తేల్చింది. కోళ్లలో యాంపిసిల్లిన్రెసిస్టెన్స్ 53 శాతం, సెఫోటాక్సిమ్ రెసిస్టెన్స్51 శాతం, టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్50 శాతం, నాలిడిక్సిక్యాసిడ్ రెసిస్టెన్స్ 47 శాతం వరకు ఉన్నట్టు వెల్లడించింది. అమోక్సోక్లావ్, ఎన్రోఫ్లోక్సాసిన్, అమికాసిన్, ఇమిపీనమ్ వంటి యాంటీ బయాటిక్స్కు 40 శాతం వరకు రెసిస్టెన్స్ఉన్నట్టు పేర్కొంది. కోళ్ల పెంపకంలో యాంటీ బయాటిక్స్వాడకం ఎక్కువగా ఉండడం వల్లే, వాటిలో యాంటీ బయాటిక్స్కు నిరోధకత పెరుగుతున్నట్టు హెచ్చరించింది. ప్రతి యాంటీ బయాటిక్కు కోళ్లలో ఎంతో కొంత రెసిస్టెన్స్ఉన్నట్టు స్టడీ స్పష్టం చేసింది. మల్టీ డ్రగ్రెసిస్టెన్స్కోళ్లలోనే ఎక్కువగా కనిపిస్తున్నట్టు వెల్లడించింది. మేకల్లో సెఫొటాక్సిమ్రెసిస్టెన్స్ 41 శాతం ఉండగా అమికాసిన్కు 35 శాతం, యాంపిసిల్లిన్కు 26 శాతం దాకా నిరోధకత పెరుగుతున్నట్టు స్టడీ తేల్చింది. అదే గొర్లలో కొంచెం తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. వాటిల్లో 37 శాతం వరకు రెసిస్టెన్స్ ఉంటున్నట్టు వెల్లడించింది. యాంటీ బయాటిక్స్వాడకం గొర్లు, మేకల్లోనూ క్రమక్రమంగా పెరుగుతున్నదని హెచ్చరించింది.
ఆవులు, బర్లలో తక్కువ..
ఆవులు, బర్లలో యాంటీ బయాటిక్రెసిస్టెన్స్తక్కువగా ఉన్నట్టు స్టడీలో తేలింది. ఆవులు, బర్లు ఇచ్చే పాలపైనా యాంటీ బయాటిక్స్టెస్ట్ చేశారు. వాటిలో రెసిస్టెన్స్5శాతం లోపే ఉందని వెల్లడైంది. బర్లు, ఆవుల పెంపకంలో యాంటీ బయాటిక్స్వాడకం తక్కువగా ఉండడం వల్లే రెసిస్టెన్స్తక్కువగా ఉన్నట్టు రిపోర్ట్తేల్చింది. అయితే పెన్సిలిన్, ఎరిత్రోమైసిన్వంటి వాటికి మాత్రం 19 శాతం వరకు రెసిస్టెన్స్ఉంటున్నట్టు స్టడీలో తేలింది. 62 శాతం శాంపిళ్లలో పెన్సిలిన్కు రెసిస్టెన్స్ ఉన్నట్టు తేలింది. అయితే ఈ–కొలికి సెఫొటాక్సిమ్రెసిస్టెన్స్బర్ల పాలలో 29 శాతం, ఆవు పాలలో 28 శాతం వరకు ఉన్నట్టు తేలింది.
చేపల్లోనూ ఎక్కువే..
చెరువుల్లో పెంచే చేపల్లోనూ యాంటీ బయాటిక్రెసిస్టెన్స్పెరుగుతున్నట్టు రిపోర్ట్హెచ్చరించింది. వాటిల్లో పెన్సిలిన్స్కు 91 శాతం మేర రెసిస్టెన్స్ఉన్నట్టు తెలిపింది. సిప్రోఫ్లోక్సాసిన్కు(54 శాతం), ఎరిత్రోమైసిన్కు (34 శాతం) వరకు రెసిస్టెన్స్ఉందని చెప్పింది. రొయ్యల్లో పెన్సిలిన్స్కు 94 శాతం రెసిస్టెన్స్వచ్చినట్టు వెల్లడించింది. వివిధ రకాల బ్యాక్టీరియాలకు తగ్గట్టు ఈ రెసిస్టెన్స్ మారుతున్నదని, అన్ని బ్యాక్టీరియాలకూ చేపలు, రొయ్యల్లో 70 నుంచి 90 శాతం వరకు రెసిస్టెన్స్ పెరుగుతున్నదని రిపోర్ట్ స్పష్టం చేసింది. మల్టీ డ్రగ్రెసిస్టెన్స్ 39 శాతంగా ఉన్నట్టు వెల్లడైంది.
మరింత స్టడీ అవసరం..
కోళ్లు, గొర్లు, బర్లు, మేకలు, చేపలు, ఆవుల్లో యాంటీ బయాటిక్స్కు రెసిస్టెన్స్పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశమని రిపోర్ట్ పేర్కొంది. వాటిల్లో రెసిస్టెన్స్పెరుగుతున్నదంటే యాంటీ బయాటిక్స్ వాడకం పెరుగుతున్నట్టేనని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై నిఘా పెట్టి, మరింత లోతుగా స్టడీ చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. చేపల పెంపకంలోనూ యాంటీ బయాటిక్స్ వాడకం ఆందోళనకరమని పేర్కొంది. యాంటీ బయాటిక్స్వాడకం, వాటిలో రెసిస్టెన్స్పై తప్పనిసరిగా సర్వైలెన్స్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పింది. మనుషులకు వాడే సెఫొటాక్సిమ్ వంటి యాంటీ బయాటిక్స్కు కూడా అవి నిరోధకతను సంతరించుకుంటున్నాయంటే.. వాటికి డైరెక్ట్గా ఆ యాంటీబయాటిక్ను వాడుతున్నారా? లేదా మనుషుల ద్వారా వెళ్తున్నదా? కలుషిత వాతావరణం ద్వారా వాటిలో అవశేషాలుంటున్నాయా అన్నది తేలాల్సిన అవసరం ఉందని తెలిపింది. మరోవైపు వాడుకలో లేని పెన్సిలిన్వంటి యాంటీ బయాటిక్లకు చేపలు, కోళ్లలో రెసిస్టెన్స్పెరగడం ఆందోళనకరమైన అంశమని పేర్కొంది. వీటిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.
యాంటీ బయాటిక్స్ వాడకం విచ్చలవిడిగా పెరుగుతున్నట్టే..
కోళ్లు, చేపలు, గొర్లకు యాంటీ బయాటిక్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల భవిష్యత్లో మనకు ఇన్డైరెక్ట్గా నష్టం జరిగే చాన్స్ ఉంటుంది. యాంటీ బయాటిక్ రెసిస్టెన్స్ వస్తే వాటి జబ్బులు తగ్గే అవకాశం ఉండదు. ఇన్ఫెక్షన్ సోకిన వాటి మాంసాన్ని అలాగే మనకు ఇస్తే జూనోటిక్ డిసీజెస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మాంసం త్వరగా ఇచ్చేలా వాటి ఎదుగుదలకు యాంటీ బయాటిక్లు వాడుతున్నట్టైతే డైరెక్ట్గా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. యాంటీ బయాటిక్స్కు అవి రెసిస్టెన్స్ను పెంచుకుంటున్నాయం టే.. యాంటీ బయాటిక్స్ వాడకం పెరిగిపోతు న్నదనే అర్థం. పెన్సిలిన్స్కు ఎక్కువ రెసిస్టెన్స్ ఉందంటే ఆ కేటగిరీలోని హయ్యర్ యాంటీ బయాటిక్స్కూ రెసిస్టెన్స్ వచ్చే చాన్స్ ఉంటుంది.
- డాక్టర్ సోమశేఖర్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, హైదరాబాద్