
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ.. రాజకీయ వాతావరణం మారిపోతోంది.ఏపీలో బీజేపీ–జనసేన పొత్తు విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుపెట్టుకున్నారన్నారు. అయితే జనసేన .. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదన్నారు. జనసేనాని బీజేపీతో పొత్తులో ఉన్నామనే చెబుతున్నారన్నారు. టీడీపీతో పొత్తు విషయంలో కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
. వచ్చే ఎన్నికల్లో తాను పలానాచోట పోటీ చేస్తానని పార్టీని అడగలేదన్నారు పురంధేశ్వరి.. కానీ, పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని పురంధరేశ్వరి అన్నారు. కాగా, గతంలో కూడా బీజేపీ-జనసేన రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయని పవన్ చెప్పడం.. జనసేనాని కూడా అదే చెప్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు చెబుతున్న విషయం విదితమే.. తమతో తెగదెంపులు చేసుకుంటున్నట్లుగా జనసేన ఎక్కడా చెప్పలేదని.. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నామని ఇప్పటికే పురంధేశ్వరి తెలిపారు.