
అమరావతి: తెలంగాణలో తనను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఫోన్ ట్యాపింగ్ జగన్, కేసీఆర్ ఇద్దరు కలిసి ఫోన్ ట్యాపింగ్ స్కెచ్ వేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు.బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న..ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం..తన ఫోన్, తన భర్త, కుటుంబ సభ్యులను ట్యాపింగ్ చేశారన్నారు షర్మిల. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేయాలని షర్మిల కోరారు.
రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలన్నారు షర్మిల. అనాడు జగన్, కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి.. రక్త సంబంధం కూడా చిన్నబోయింది. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు వైవీ సుబ్బారెడ్డే స్వయంగా చెప్పారని.. ఆనాడు ట్యాపింగ్ జరిగిన ఓ ఆడియోను నాకు వినిపించారన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మన్నా వస్తానన్నారు షర్మిల.
►ALSO READ | ఏపీ పోలీసుల అదుపులో కొడాలి నాని..?
జగన్ తన సొంత మేనల్లుడు,మేన కోడలు ఆస్తి కాజేసే అంశంలో సుబ్బారెడ్డితో అబద్ధాలు చెప్పించాడని ఆరోపించారు షర్మిల. ఇలాంటి పరిస్థితిలో వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకుంటాడు అనుకోను..ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికైనా వస్తా..ఏ విచారణను అయినా ఎదుర్కొంట అని వైఎస్ షర్మిల అన్నారు.