ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ తమకు ఆమోదం యోగ్యం కాదని, చర్చలు పూర్తయ్యేవరకు పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం ఏపీ సర్కారు ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమల్లోకి తీసుకువచ్చింది. కొత్త పీఆర్సీ ప్రకారం వేతన బిల్లులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు తాజా పీఆర్సీ అమల్లోకి వచ్చిందని ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.
ట్రెజరీ డైరెక్టర్, డీడీవోలు, ట్రెజరీ అధికారులు పీఆర్సీ అమలుపై దృష్టి సారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 25 లోగా వేతన బిల్లులు రూపొందించి సీఎఫ్ఎంఎస్ కు పంపాలని చెప్పారు. ప్రతిరోజు పురోగతిపై స్పెషల్ చీఫ్ సెక్రటరీకి నివేదిక అందించాలని ఆదేశించారు.