విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తాము తమ రాష్ట్రానికి కేటాయించిన నీటినే వాడుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ, ఏపీ మధ్య ముదురుతున్న జలవివాదంపై ఏపీ ప్రభుత్వం కేబినెట్ భేటీ నిర్వహించింది. తెలంగాణ సర్కార్ అభ్యంతరాలు, ఎన్జీటీ ఆదేశాలపై కేబినెట్లో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం, నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఏపీ కేబినెట్ తీవ్రంగా ఖండించిందని మంత్రి అనిల్ అన్నారు. జలవిద్యుత్ ఆపాలని కేఆర్ఎంబీ తెలంగాణకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. నీటి వాటాల విషయంలో తెలంగాణ మంత్రులు మాట్లాడే భాష సరిగా లేదని ఆయన మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం నేతలు ఇష్టంవచ్చినట్లు మాట్లాడటం దుర్మార్గం అని ఆయన అన్నారు. సున్నితమైన సమస్య కాబట్టే మేం ఎక్కువగా మాట్లాడటం లేదని.. లేకపోతే మాకు మాట్లాడటం చేతకాదా అని అనిల్ అన్నారు. ఏ ప్రాజెక్టు కట్టినా తమకు కేటాయించిన నీటినే వాడుకుంటామని మంత్రి అనిల్ అన్నారు. తమ రాష్ట్ర ప్రజల కోసం ఎందాకైనా వెళ్తామని ఆయన అన్నారు. మా సంయమనాన్ని చేతకానితనం అనుకోవద్దని ఆయన హెచ్చరించారు. ఏపీ ప్రజలు ఎంతోమంది తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ మంత్రులు ఎంత కఠినంగా మాట్లాడితే.. తాము కూడా అంతే కఠినంగా ప్రతిస్పందిస్తామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు నోళ్లున్నాయని.. తాము గట్టిగానే మాట్లాడతామని ఆయన అన్నారు. తాము అనవసరంగా మాట్లాడమని.. తమ చేతలే మాట్లాడుతాయని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను అనుమతులు లేకుండానే కడుతుంది. ఏపీకి తెలంగాణ చేస్తున్న అన్యాయంపై కేంద్రానికి, జలశక్తి శాఖకు లెటర్ రాస్తామని ఆయన అన్నారు.
మా ఓర్పును చేతగానితనం అనుకోవద్దు
- ఆంధ్రప్రదేశ్
- June 30, 2021
లేటెస్ట్
- రాష్ట్రంలో బీజేపీకి సానుకూల పరిస్థితి ఉంది: కిషన్రెడ్డి
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- ఫోన్ వాడొద్దని చెప్పినందుకు అన్నను గొడ్డలితో నరికి చంపిన 14ఏళ్ల బాలిక
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- సమ్మర్ స్పెషల్ ప్రూట్.. తాటిముంజలు.. ఇవి ఎన్ని లాభాలో...
- Samyuktha Menon: మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్న సంయుక్త మీనన్.. హీరో ఎవరో తెలుసా?
- ఇది పాలమూరు ఆత్మగౌరవ ఎన్నిక : వంశీచంద్రెడ్డి
- మహిళా డిగ్రీ కాలేజీ తేలేని అసమర్థుడు జగదీశ్ రెడ్డి : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- ఇవాళ అయోధ్యలో మోదీ రోడ్ షో
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు