రూ. 416 కోట్లు సేకరించిన అపోలో మైక్రో సిస్టమ్స్

రూ. 416 కోట్లు సేకరించిన అపోలో మైక్రో సిస్టమ్స్

న్యూఢిల్లీ: ఏరోస్పేస్, రక్షణ  హోంల్యాండ్ సెక్యూరిటీ రంగాలకు సేవలు అందించే అపోలో మైక్రో సిస్టమ్స్ ఈక్విటీ షేర్లు,  కన్వర్టబుల్ వారెంట్ల ద్వారా మొత్తం రూ. 416 కోట్లకు పైగా సమీకరించినట్లు ప్రకటించింది. ఈ కేటాయింపులు ప్రమోటర్ గ్రూప్, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదిత్య కుమార్ హల్వాసియా, ఎల్​ఐసీ మ్యూచువల్ ఫండ్‌‌‌‌కు జరిగాయి. 

ప్రిఫరెన్షియల్​ఇష్యూలో 2.70 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కొక్కటి రూ. 114 చొప్పున కేటాయించి రూ. 308 కోట్లు సమీకరించింది.