ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనం

ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనం

విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు కొండపైకి పోటెత్తారు. తెల్లవారుజామునుంచే  అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.