
న్యూఢిల్లీ: భారతదేశం నుంచి స్మార్ట్ఫోన్ల ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ జూన్ క్వార్టర్లో దేశం నుంచి జరిగిన మొత్తం స్మార్ట్ఫోన్ ఎగుమతుల విలువ ఏడు బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.60,326 కోట్లు) చేరింది.
ఇందులో టెక్ యాకంపెనీ యాపిల్ సంస్థ ఒక్కటే 5 బిలియన్ డాలర్ల (రూ.43,090 కోట్లు)విలువైన ఐఫోన్లను ఎగుమతి చేయడం విశేషం. ఏడాది లెక్కన వీటి విలువ 40 శాతం పెరిగింది.
తన ప్లాంట్లను చైనా నుంచి ఇతర దేశాలకు విస్తరించాలనే వ్యూహంలో భాగంగా యాపిల్ భారతదేశాన్ని కీలక హబ్గా మార్చుకుంటోంది. ప్రభుత్వాల ప్రోత్సాహకాలు, 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ఈ రికార్డు ఎగుమతుల్లో యాపిల్ వాటానే అత్యధికంగా ఉండగా, శాంసంగ్ వంటి ఇతర కంపెనీలు తరువాతి స్థానాల్లో నిలిచాయి.