MI vs KKR : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఐపీఎల్లో సచిన్ తనయుడి అరంగేట్రం

MI vs KKR : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఐపీఎల్లో సచిన్ తనయుడి అరంగేట్రం

సచిన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం వచ్చేసింది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరుపున సచిన్ తనయుడి అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ అయిన అర్జున్ ను ముంబై 2021లో బేస్ ప్రైజ్ కు కొనుగోలు చేసింది. 

అయితే, అప్పటినుంచి ముంబై ఫ్రాంచేజీలో ఉన్నా.. అర్జున్ కు అవకాశాలు మాత్రం దక్కలేదు. రెండు సీజన్లు బెంచ్ కే పరిమితం అయ్యాడు. ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన అర్జున్.. తొలి ఓవర్ వేసి బ్యాట్స్ మెన్ ను భయపెట్టాడు. మొదటి ఓవర్లో కేవలం 4 పరుగులే ఇచ్చి మంచి స్టార్ట్ ను అందించాడు. అర్జున్ టెండూల్కర్ బ్యాటింగ్ కూడా చేయగలడు. గతేడాది గోవా తరుపున రంజీల్లో అడుగుపెట్టిన అర్జున్.. సెంచరీ కూడా చేశాడు.