అవినీతిరహిత పాలన అందిస్తా : పైడి రాకేశ్​రెడ్డి

అవినీతిరహిత పాలన అందిస్తా : పైడి రాకేశ్​రెడ్డి

నందిపేట, వెలుగు: ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఐదేండ్లపాటు అవినీతిరహిత పాలన అందిస్తానని ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎంపీపీ వాకిడి సంతోష్​రెడ్డి అధ్యక్షతన నందిపేటలో నిర్వహించిన మండల సర్యసభ్య సమావేశానికి జడ్పీ చైర్మన్​ విఠల్​రావుతో కలిసి హాజరయ్యారు. ప్రోగ్రామ్​లో ముందుగా ఆయా శాఖల అధికారులు ప్రగతి నివేదికలు చదివి వినిపించారు.

ట్రాన్స్​కో అధికారులు డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొండూర్​ సర్పంచ్​ సభా దృష్టికి తీసుకురాగా, పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో పైరవీలకు తావులేదన్నారు. నందిపేటను మున్సిపాలిటీ చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.

జడ్పీ చైర్మన్​ విఠల్​రావు ​మాట్లాడుతూ పల్లెల అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం మరో రెండు రోజుల్లో పదవీ విరమణ చేయనున్న సర్పంచులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్​ఆనంద్, ఎంపీడీవో నాగవర్ధన్, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.