
దాబా నిర్వాహకుల దాడిలో 16 మంది జవాన్లు, ఓ మేజర్ ఆఫీసర్ తీవ్రంగా గాయపడిన ఘటన పంజాబ్ లోని రోపార్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన మార్చి 11 సోమవారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లడఖ్ స్కౌట్స్కు చెందిన మేజర్ సచిన్ సింగ్ కుంతల్, 16 మంది సైనికులు ఆదివారం లాహౌల్లో జరిగిన స్నో మారథాన్లో పాల్గొని విజయం సాధించారు. అనంతరం తిరిగి వస్తున్న వారు సోమవారం రాత్రి మనాలి-రోపర్ రహదారిలోని భరత్ఘడ్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఆల్పైన్ ధాబాలో భోజనం చేశారు. తిన్న తర్వాత ఆన్ లైన్ లో బిల్లు చెల్లిస్తామని ఆర్మీ జవాన్లు అన్నారు. లేదు క్యాష్ మాత్రమే ఇవ్వాలని యజమాని డిమాండ్ చేశాడు. వారి దగ్గర క్యాష్ లేకపోవడంతో యూపీఐ ద్వారా ఆన్ లైన్ లో బిల్ చెల్లించారు.
దీంతో యజమాని వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ధాబాకు చెందిన సుమారు 35 మంది వ్యక్తులు ఆర్మీ మేజర్, 16 మంది జవాన్లపై దాడి చేశారు. ముఖంపై కర్రలు, ఇనుప రాడ్లతో వారిని కొట్టారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడిలో ఆర్మీ మేజర్ తీవ్రంగా గాయపడి కిందపడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆర్మీ మేజర్, సైనికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ధాబా యజమానితో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం వెతుకుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పంజాబ్లోని రోపార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.