ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి : డీసీపీ ధార కవిత

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి :  డీసీపీ ధార కవిత

రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు వీధిన పడుతున్నాయని, రోడ్డు భద్రత నియమాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పోలీసులు అధికారులు సూచించారు. మంగళవారం పోలీస్​ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా ‘అరైవ్​ అలైవ్’​ ప్రోగ్రామ్​ను చేపట్టారు. ఈ కార్యక్రమంలో హెల్మెట్, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడకూడదని, ట్రాఫిక్​ రూల్స్​ పాటించాలని అవేర్నెస్​ కల్పించారు.

 జయశంకర్​ భూపాలపల్లిలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ​​హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో వరంగల్​ కమిషనరేట్​ సెంట్రల్​ జోన్​ డీసీపీ ధార కవిత, మహబూబాబాద్​ జిల్లా తొర్రూర్​లో డీఎస్పీ కృష్ణ కిషోర్, ములుగు జిల్లా వెంకటాపురంలో సీఐ ముత్యం రమేశ్ అవగాహన కార్యమాల్లో పాల్గొని మాట్లాడారు.- జయశంకర్​ భూపాలపల్లి/ ఎల్కతుర్తి/ తొర్రూర్/ వెంకటాపురం, వెలుగు