భారత్, న్యూజిలాండ్ సిరీస్ వేదికలు ఖరారు

భారత్, న్యూజిలాండ్ సిరీస్ వేదికలు ఖరారు

భారత పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్ తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. జనవరి 18న ప్రారంభం కాబోయే మొదటి వన్డే మ్యాచ్ కి హైదరాబాద్ లోని రాజివ్ గాంధీ ఇంటర్నేష్నల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.  రెండవ మ్యాచ్ జనవరి 21న రాయ్ పూర్ లో, మూడవ వన్డే జనవరి 24 ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. టీ20 సిరీస్ జనవరి 27 రాంచీ, 29 లక్నో, ఫిబ్రవరి 1అహ్మదాబాద్ వేదికల్లో మ్యచ్ లు జరగుతాయి.

అయితే, నవంబర్ లో న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ని భారత్ 0-1తో ఓడిపోయింది. తర్వాత డిసెంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన ఓడీఐ సిరీస్ లోనూ టీం ఇండియా 1-2తో సిరీస్ కోల్పోయింది. అయితే, న్యూజిలాండ్ తో జరిగే  సిరీస్ ని గెలవడంతో పాటు జట్టు సెలక్షన్, ఆటగాళ్ల ఫిట్ నెప్ పై దృష్టి పెట్టారు.