ప్రాక్టీస్‌ పెంచిన టీమిండియా

ప్రాక్టీస్‌ పెంచిన టీమిండియా

లండన్‌‌: ఇంగ్లండ్‌‌తో ఏకైక టెస్ట్‌‌కు సమయం దగ్గరపడుతున్న వేళ.. టీమిండియా ప్రాక్టీస్‌‌ను ముమ్మరం చేసింది. లీస్టర్‌‌షైర్‌‌ కౌంటీ గ్రౌండ్​లో సోమవారం పూర్తి స్థాయి నెట్‌‌ సెషన్‌‌లో పాల్గొంది. మొదట కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ, శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ తమ బ్యాటింగ్‌‌ స్కిల్స్‌‌ను సరి చూసుకున్నారు. మూడు నెలలుగా రెడ్‌‌బాల్‌‌కు దూరంగా ఉన్న ఈ ఇద్దరూ ఎక్కువగా షార్ట్‌‌ బాల్స్​ను ప్రాక్టీస్‌‌ చేశారు. మిగతా వారు వర్కౌట్స్‌‌ తర్వాత నెట్స్‌‌లో బ్యాట్లు పట్టారు. బౌలర్లందరూ కాసేపు రన్నింగ్‌‌ డ్రిల్‌‌ చేసిన తర్వాత బౌలింగ్‌‌ వేశారు. బ్యాటింగ్‌‌ కోచ్‌‌ విక్రమ్‌‌ రాథోడ్‌‌ ఆధ్వర్యంలో పుజారా క్యాచ్‌‌లు ప్రాక్టీస్‌‌ చేశాడు. ఈ టూర్‌‌ ప్రిపరేషన్స్‌‌లో భాగంగా టీమిండియా.. ఈ నెల 24 నుంచి లీస్టర్‌‌షైర్‌‌తో వామప్‌‌ మ్యాచ్‌‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌‌లో ఫుల్‌‌ టీమ్‌‌ను దించాలని మేనేజ్‌‌మెంట్‌‌ భావిస్తోంది. ఇక, సౌతాఫ్రికాతో సిరీస్​ ముగించుకొని లండన్‌‌ బయలుదేరిన చీఫ్‌‌ కోచ్‌‌ రాహుల్​ ద్రవిడ్‌‌, రిషబ్​ పంత్‌‌, శ్రేయస్‌‌ అయ్యర్​.. మంగళవారం టీమ్‌‌తో కలవనున్నారు.