స్టూడెంట్లను నిర్లక్ష్యం చేయొద్దు : ఇన్చార్జ్డీఈవో దీపక్ తివారీ

స్టూడెంట్లను నిర్లక్ష్యం చేయొద్దు : ఇన్చార్జ్డీఈవో దీపక్ తివారీ

కాగజ్ నగర్, వెలుగు: సర్కార్ బడుల్లో పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీచర్లు బాధ్యతాయుతంగా పని చేయాలని, నాణ్యమైన విద్య అందించేందుకు  ప్రభుత్వం చేపడుతున్న చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని ఆసిఫాబాద్ ​అడిషనల్ కలెక్టర్, ఇన్​చార్జ్​డీఈవో దీపక్ తివారీ ఆదేశించారు. సోమవారం  కౌటాల మండలం బోదంపల్లి జడ్పీ స్కూల్, మండల కేంద్రంలోని శ్యాం మోడల్ ప్రైవేట్ స్కూల్, బెజ్జూరులోని ఓవర్​కమ్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్, కాగజ్ నగర్ పట్టణంలోని పలు ప్రైవేట్​స్కూళ్లను వారు తనిఖీ చేశారు. 

విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు పరిశీలించారు. ప్రతి ప్రభుత్వ స్కూల్​లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన టీచర్లతో విద్యాబోధన చేస్తున్నామన్నారు. అప్​గ్రేడ్ కోసం దరఖాస్తు చేసిన ప్రైవేట్ స్కూళ్లలో నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు ఉండాలని సూచించారు. ఎంపీడీవో ప్రసాద్, ఎంఈవోలు హన్మంతు, ప్రభాకర్ తదితరులున్నారు.