జనగామ అర్బన్, వెలుగు: జనగామ పోలీస్ స్టేషన్ లో ఏఎస్పీ పండేరీ చేతన్ నితిన్ శుక్రవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఏఎస్పీ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కిట్ మెయింటెనెన్స్, నీట్ టర్న్ ఔట్, విధి నిర్వహణలో క్రమశిక్షణ, వృత్తి పరమైన నైపుణ్యాలు, పీఎస్కు సంబంధించిన రికార్డులు, కేసు డైరీలు, సీడీ ఫైళ్లు, వివిధ రిజిస్టర్లు, ఇతర అధికారిక దస్తావేజులను పరిశీలించారు.
కేసుల నమోదు విధానం, పెండింగ్ కేసుల స్థితిగతులు, దర్యాప్తు పురోగతి, రికార్డుల అప్డేట్, స్టేషన్ పరిశుభ్రత, ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ఉల్లంఘనలు, ప్రజా శాంతిభద్రతలు, లా అండ్ఆర్డర్ అంశాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సైలు రతీశ్, చెన్నకేశవులు, భరత్, నర్సయ్య, హెడ్ కానిస్టేబుల్ సిరాజ్, యాదగిరి, కానిస్టేబుళ్లు కృష్ణ, లక్ష్మణ్, కరుణాకర్, బాలమల్లయ్య పాల్గొన్నారు.
