ఆస్ట్రియాలో దారుణం..స్కూల్లో కాల్పులు..10మంది విద్యార్థులు మృతి

ఆస్ట్రియాలో దారుణం..స్కూల్లో కాల్పులు..10మంది విద్యార్థులు మృతి

ఆస్ట్రియాలో దారుణం.. దక్షిణ ఆస్ట్రియాలోని గ్రాజ్ నగరంలో ఓ స్కూల్ లో ఓ యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. మంగళవారం (జూన్10) ఉదయం జరిగిన కాల్పుల్లో10మంది మృతిచెందారు. అనేక మందిగాయపడ్డారు. మృతుల్లో ఎనిమిది మంది విద్యార్థులు, ఓ టీచర్ ప్రాణాలు కోల్పోగా..మరో పదిమందికి బుల్లెట్ గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన నిందితుడు ఘటన తర్వాత తనను తాను కాల్చుకొని చనిపోయాడు. గ్రాజ్ నగరంలోని BORG డ్రీయర్‌స్చుట్జెంగాస్సే పాఠశాలలో ఈ కాల్పులు జరిగాయి.

గ్రాజ్ పాఠశాలలో జరిగిన దాడిలో తొమ్మిది మంది  మృతిచెందారని, వీరిలో ఎనిమిది మంది విద్యార్థులు, ఓ యువకుడు, టీచర్ ఉన్నట్లు ఆస్ట్రియన్ ప్రెస్ ఏజెన్సీ మేయర్ ఎల్కే కహర్ ధృవీకరించారు. ఆస్ట్రియన్ రాష్ట్ర స్థానిక మీడియా ప్రకారం..కాల్పులు జరిపిన వ్యక్తి పాఠశాల విద్యార్థిగా తెలుస్తోంది. మంగళవారం ఉదయం 10గంటలకు కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం నిందితుడు పాఠశాల టాయిలెట్‌లో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

గాయపడిన విద్యార్థులను సమీపంలోని హెల్మట్ లిస్ట్ హాల్‌కు తరలించారు. అక్కడ వారికి రెడ్‌క్రాస్ నుంచి చికిత్స అందించారు.