Ather Rizta : ఏప్రిల్లో ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. బుకింగ్స్ ప్రారంభమయ్యాయి

Ather Rizta : ఏప్రిల్లో ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. బుకింగ్స్ ప్రారంభమయ్యాయి

ఏథర్ ఎనర్జీ తన కొత్త మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ Ather Rizta అమ్మకాలు త్వరలో ప్రారంభించబోతోంది. ఇందుకోసం ముందుగా బుకింగ్స్ ప్రారంభించింది.  కేవలం 999  రీఫండబుల్ అమౌంట్ తో కంపెనీ వెబ్ సైట్ లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. ఏథర్ రిజ్టా ధర వివరాలను ఏప్రిల్  6న బెంగళూరులో జరిగే 2024 కమ్యూనిటీ డే సెలబ్రేషన్స్ లో విడుదల చేయనుంది. 

ఇటీవల ఏథర్ రిజ్టా  టీజర్ ను సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లలో విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇందులో 400 మి.మీ వాటర్ లో దాని పనితీరును చూపిస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ లో కీలక డిజైన్ కు సంబంధించిన చాలా అంశాలను బయటపెట్టింది. విశాలమైన ఫ్రంట్ ఆప్రాన్, లేటెస్ట్ టెలిస్కోపిక్ ఫోర్క, విశాలమైన టైర్, టీఎఫ్ టీ స్ర్కీన్ అంశాలను ఇందులో ఐలైట్ చేసింది కంపెనీ. అయినప్పటికీ ఖచ్చితమై  ప్రత్యేకతలను రివీల్ చేయలేదు.  

రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పెద్ద బ్యాటరీతో  రావచ్చన కంపెనీ వర్గాలు సూచిస్తున్నాయి. రిజ్టా మోడల్ ను బట్టి ఇది 450 కీ.మీలో వరకు వెళ్లగలదు. దీనిలో 2.9Wh, 3.7 kwh అనే రెండు బ్యాటరీ ఎంపికలను అందిస్తుంది.అదనంగా కొత్త రిజ్టా లో అత్యవసర స్టాప్ సిగ్ల(ESS), టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్స్క్ , LED లైటింగ్, రెండు చివర్లలో సింగిల్ డిస్క్ లే అవుట్ , విశాలమైన సీటు వంటి సదుపాయాలు ఉంటాయని సూచిస్తున్నాయి.