- మరో ఏటీఎంలోనూ దొంగతనానికి యత్నం
- అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా అనుమానం
- గోదావరిఖనిలో ఘటన
గోదావరిఖని,వెలుగు: పెద్దపల్లి జిల్లా రామ గుండం పారిశ్రామిక ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి రెండు ఏటీఎంలలో దొంగలు పడ్డారు. ఓ ఏటీఎంలో డబ్బు చోరీకి యత్నించి విఫలం కాగా, మరో ఏటీఎంలోని మెషీన్ను గ్యాస్ కట్టర్తో కట్చేసి రూ.27.75 లక్షలను ఎత్తుకెళ్లారు. దొంగల కోసం టీమ్లుగా ఏర్పడిన పోలీసులు గాలిస్తున్నారు. గోదావరిఖని గంగానగర్లోని ఎస్బీఐ ఏటీఎంలోకి శుక్రవారం అర్ధరాత్రి చొరబడిన దొంగలు మెషీన్ను పగలగొట్టారు. అప్పుడే పోలీస్సైరన్మోగడంతో పరారయ్యారు.
గౌతమీనగర్హన్మాన్టెంపుల్సమీపంలోని ఎస్బీఐకే చెందిన ఏటీఎంలోకి తెల్లవారుజామున1.30 గంటలకు ఓ దొంగ చొరబడి సీసీ కెమెరాపై స్ప్రే చేశాడు. తర్వాత మరికొందరు ప్రవేశించి ఏటీఎం షట్టర్ను మూసివేశారు. తర్వాత గ్యాస్ కట్టర్తో మెషీన్ను కట్చేసి తొలగించారు. అందులో ఉన్న రూ.27,75,400 నగదుతో పరారయ్యారు.
చోరీ తర్వాత రోడ్లపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ కారు గోదావరినది బ్రిడ్జిపై నుంచి మంచిర్యాల వైపుకు వెళ్లినట్టు గుర్తించారు. ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా భావిస్తున్నారు. గోదావరిఖని ఏసీపీ తులా శ్రీనివాసరావు నేతృత్వంలో ఇన్స్పెక్టర్లతో మూడు టీమ్లను ఏర్పాటు చేశారు. రెండు ఏటీఎంలలో చొరబడిన దొంగల టీమ్ ఒక్కటేనా లేక వేర్వేరా అన్నది తేలాల్సి ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.